హైదరాబాద్, నవంబర్ 02 : ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్ల జారీపై పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో వూరట లభించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి చుక్కెదురైంది. కొత్త జిల్లాల ప్రాతిపదికగా ఇచ్చిన ప్రకటన వల్ల తమకు నష్టం జరుగుతుందని అందువల్ల నోటిఫికేషన్ల జారీని రద్దు చేయాలంటూ కొందరు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. రాష్ట్రంలో 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి గత నెల 21న టీఎస్పీఎస్సీ ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.