శివసేన అధినేతతో సమావేశమైన మమతా బెనర్జీ

SMTV Desk 2017-11-02 17:08:02  Chief Minister Mamata Banerjee, West bangal, Uthav Thackeray, meeting, mumbai

ముంబై, నవంబర్ 02 : పశ్చిమ బంగ్లాకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో తమ రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు ముంబైలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించనున్నట్లు సమాచార౦. ఇందు నిమిత్తం మమతా.. మంగళవారం సాయంత్రం నేరుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీతో సమావేశమయ్యారు. త్వరలో తను లండన్‌ పర్యటనకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.