నారాయణ సంస్థ ఆడియో హాల్ చల్...

SMTV Desk 2017-11-02 15:12:53  narayana college audio, suicides, Hyderabad,

హైదరాబాద్, నవంబర్ 2 : వరుసగా విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థలకు సంబందించిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఈ ఆడియో టేపులో ఆ సంస్థకు చెందిన ప్రిన్సిపాల్, సహచర లెక్చర్ తో మాట్లాడిన సంభాషణలు, ఆ సంభాషణలలో... నోట్ల రద్దు సమయంలో భారీగా నగదు మార్చినట్టు వెల్లడించారు. అంతే కాదు శ్రీలత అనే మహిళా ప్రిన్సిపాల్, జై సింహ రెడ్డి అనే ఉన్నతోద్యోగి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందన్నారు. శ్రీలత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా మార్చారో పూసగుచ్చినట్లు వివరించారు. ఈ టేపు లికేజిపై, సంస్థ ఉన్నతాధికారులు రంగంలోకి దిగాయి. ఆడియోను బహిర్గతం చేశారంటూ నవీన్ రెడ్డి అనే వ్యక్తిపై దాడికి దిగారు. నవీన్ రెడ్డి రామంతపూర్ లోని నారాయణ కాలేజీలో మూడేళ్ళుగా ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. ఈ మేరకు ఆయన పోలీసులను ఆశ్రయించి తనకు ప్రాణ హాని ఉందంటూ రాత పూర్వకంగా తార్నాక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అంతే కాదు దీనిపైన విచారణ జరిపించాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘనేత నరేందర్ గౌడ్ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో అక్రమాలు, అనైతిక వ్యవహారాల గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం చెలరేగుతోంది.