ఎన్టీపీసీ ఘటనపై మోదీ సంతాపం..

SMTV Desk 2017-11-02 13:14:41  NTPS Power station, Modi, utharapradesh

రాయ్‌బరేలీ, నవంబర్ 02 : భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదానికి బలైన మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రంలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈఘటనపై ప్రధాన మంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరగడం చాలా బాధకరమని, బాధితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పీఎంవో వెల్లడించింది.