హైదరాబాద్, నవంబర్ 02 : తెలంగాణ రాష్ట్రంలో అసలు క్రీడలు జరగకపోవడం కూడా మీ నిర్వాకమే అంటూ భాజపా నేత కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం 500 ఎస్సీ వసతి గృహాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటిని వదిలేసి కొత్త సచివాలయం ఎందుకు నిర్మిస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఉన్న సచివాలయంలో అవసరమైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని కొత్త సచివాలయం అనవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో, కొత్త సచివాలయం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు కిషన్రెడ్డి ప్రకటించారు.