విజయనగరం, నవంబర్ 01; విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని బీసీ హాస్టల్లో దారుణమైన ఘటన జరిగింది. హాస్టల్ సిబ్బంది కూల్ డ్రి౦క్ లో మద్యం కలిపి విద్యార్దులతో తాగించారు. మద్యం మత్తులో ఉన్న విద్యార్ధులు సిబ్బందితో కలిసి డాన్స్ చేశారు. ఈ విధంగా సిబ్బంది మద్యం పుచ్చుకొని విద్యార్ధులకు తెలియకుండా వారితో మద్యం తాగించిన విషయన్ని తెలుసుకొన్న వారి తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఉంటే పిల్లలు సరిగా చదవట్లేదని హాస్టల్ కి పంపిస్తే సిబ్బంది ఇలా ప్రవర్తించటమేమిటని తల్లిదండ్రులు వాపోయారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.