న్యూఢిల్లీ, అక్టోబర్ 01 : ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేట్ను బట్టి నెలల వారీగా నిర్ణయిస్తున్న ధరల నేపథ్యంలో వంట గ్యాస్ ధర మరోసారి రూ.4.50 పెరిగిపోయింది. దీని వల్ల ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ రూ.495.69కి చేరింది. ఇదిలా ఉండగా సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.742గా నమోదైంది. ప్రస్తుతం దేశం మొత్తంలో సబ్సిడీ వంటగ్యాస్ వినియోగిస్తున్న వారి సంఖ్య 18.11 కోట్ల మంది ఉండగా, సబ్సిడీయేతర వంటగ్యాస్ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు.