అమరావతి, అక్టోబర్ 01 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహనిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులుతో కలిసి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాలువ మాట్లాడుతూ.. “గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల నిర్మాణాన్ని 2019 జనవరి 14 వరకు పూర్తి చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు ఈ పనులన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా౦” అని తెలిపారు. ఈ సమీక్ష అనంతర౦ మంత్రి శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. జనవరి నాటికీ రెండున్నర లక్షల ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 1.30 లక్షల ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేశామని, మరో ఐదు లక్షల ఇళ్ళను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు.