ప.గో. జిల్లాలో బాలుడి కిడ్నాప్...

SMTV Desk 2017-10-31 18:24:16  4 Years old Child Kidnapped, Bhimavaram, west godavari news.

ప.గో., అక్టోబర్ 31 : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో వండర్ కిడ్స్ స్కూల్లో చదువుతున్న శ్యామ్ అనే చిన్నారి వద్దకు వచ్చిన దుండగులు ఆ చిన్నారి తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగిందని తనను పంపించమని ఆ పాఠశాల యాజమాన్యంతో నమ్మబలికారు. ఇది నమ్మిన యాజమాన్యం ఆ చిన్నారిని ఆ దుండగుల వెంట పంపించారు. ఇక అంతే వెంటనే ఆ దుండగులు బాలుడిని తీసుకొని అక్కడి నుండి పరారయ్యారు. అన౦తరం ఆ చిన్నారి తండ్రికి ఫోన్ చేసి రూ. 5 లక్షలు ఇస్తేనే ఆ బాలుడిని క్షేమంగా అప్పగిస్తామంటూ డిమాండ్ చేశారు. దీ౦తో భయపడిన ఆ బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.