బీజింగ్, అక్టోబర్ 31 : భారతదేశంలో థియేటర్ లో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శించినపుడు నిలబడాలా..? వద్దా..? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ వేడి సెగ పొరుగు దేశమైన చైనా దేశానికి తాకినట్టుంది. చైనా.. తమ జాతీయ జెండాకు సంబంధించి ఒక సరికొత్త నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో తమ జాతీయ జెండాను అవమానించినా, గౌరవించకపోయినా మూడేళ్ళ జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. దీనికోసం చట్టసభలో త్వరలోనే బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. గతంలో 15 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంచాలని నిర్ణయం తీసుకొని తాజాగా మూడేళ్ళ జైలు శిక్షను విధించాలని నిర్ణయం తీసుకుంది.