కివీస్ తో బోణి కొడతారా ?

SMTV Desk 2017-10-31 16:06:45  INDIA, NEW ZEALAND, TWENTY 20 MATCH

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 31 : భారత్- కివీస్ మధ్య వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న కోహ్లి సేన న్యూజిలాండ్‌తో మరో యుద్ధానికి సిద్ధమవుతుంది. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా రేపు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మొదటి మ్యాచ్ జరగనుంది. టీమి౦డియా వన్డే సిరీస్ గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో ఉండగా, కనీసం టీ 20 సిరీస్ ను సాధించాలనే పట్టుదలతో కివీస్ పోరుకు సిద్ధమవుతోంది ఈ సంవత్సరం భారత్.. స్వదేశంలో రెండు టీ 20 సిరీస్ లు ఆడింది. అందులో ఒకటి ఇంగ్లాండ్ తో 2-1 తేడాతో విజయం సాధించగా, ఆసీస్ తో జరిగిన సిరీస్ ను 1-1తో సమం చేసుకుంది. అయితే 2007 నుండి చూస్తే కివీస్ తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది. పొట్టి ఫార్మాట్ లో కివీస్ పై ఖాతా తెరిచి విజయాన్ని అందుకోవడం కోసం విరాట్ సేన ఆరాటపడుతుంది.