సింగపూర్ పర్యటనకు ఖర్చంతా ప్రభుత్వానిదే..!

SMTV Desk 2017-10-31 11:09:58  Amaravati Farmers, Singapore Tour, AP CM Chandrababu naidu

అమరావతి, అక్టోబర్ 31 : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి స్వచ్చందంగా భూములిచ్చిన 123 రైతులను సింగపూర్ పర్యటనకు ఎంపిక చేసిన విషయం విదితమే. అయితే సింగపూర్ వెళ్ళడానికి, అక్కడ బస చేయడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. ఈ రైతులంతా తమ వద్ద ఉన్న డబ్బును ఏవిధంగా పెట్టుబడులు పెట్టి లాభాలను గడించవచ్చనే విషయాలను తెలుసుకోనున్నారు. ఈ సింగపూర్ పర్యటనకు ప్రభుత్వం 40 లక్షలను ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. మొదటగా 34 మంది రైతులు ఎక్కిన బస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ 123 మంది రైతులను మొత్తం నాలుగు విడతలుగా సింగపూర్ సందర్శనకు పంపనున్నారు.