శాసనసభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

SMTV Desk 2017-10-30 14:39:43  Telangna state, assembly, congress, Walkout

హైదరాబాద్‌, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ రెండో రోజు శీతాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి చేపట్టారు. బోధనా రుసుముల అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. చర్చకు ఉపసభాపతి అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. పలు అంశాలపై విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విద్యార్థుల బోధనా రుసుముల బకాయిలపై కాంగ్రెస్‌, ఉపాధి కల్పన, ఉద్యోగాల క్రమబద్ధీకరణపై భాజపా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.