హైదరాబాద్, అక్టోబర్ 30 : పేద వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఓవర్సీస్ ఉపకార వేతనాలపై ప్రశ్నార్ధకాలు జరుగుతున్న సందర్భంలో సీఎం కేసీఆర్ దళిత, బడుగు, బలహీన మైనార్టీ వర్గాల చదువుల కోసం తీసుకున్న చర్యలను వివరించారు. శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సభలో సభ్యులు స్థాయి, గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడాలని కోరారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని వెల్లడించారు.