ఫొచెఫ్స్ట్రూమ్, అక్టోబర్ ౩౦ : దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్సమన్ డేవిడ్ మిల్లర్ జూలు విదిల్చాడు. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20 లో ఈ సఫారీ ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా, 45 బంతుల్లో) రికార్డును అధిగమించాడు మిల్లర్ విధ్వంసం తో సౌతాఫ్రికా జట్టు 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లా జట్టు 18.3 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలిపోయింది.