చెన్నై, అక్టోబర్ 29 : ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్ను హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పట్నా పైరేట్సే సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో పైరేట్స్ 55-38 తేడాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ను ఓడించింది. రైడింగ్లో మరోసారి తనదైన శైలిలో చెలరేగిన నర్వాల్ పైరేట్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రదీప్ నర్వాల్ లీగ్ చరిత్రలో ఒక మ్యాచ్ లో 34 పాయింట్లు సాధించడమే కాకుండా,ఈ సీజన్లో అత్యధికంగా 369 రైడ్ పాయింట్లతో రికార్డు సృష్టించాడు. 2016 సీజన్లో జరిగిన రెండు టోర్నీల్లోనూ ఈ జట్టు విజేతగా నిలిచింది.