హైదరాబాద్, అక్టోబర్ 26: తమిళ నటుడు విజయ్ నటించిన ‘అదిరింది’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మీనన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో విజయ్ త్రిపాత్రబినయనంలో నటించడం విశేషం. ఈ ట్రైలర్ లో... ‘కళ్ళు లేకుండా బ్రతకొచ్చు కానీ... పిల్ల లేకపోతే ఎవ్వరు బ్రతకలేరు.. అని ప్రముఖ హాస్య నటి కోవై సరళ చెప్పే డైలాగ్, తల్లి బిడ్డను కనడానికి పది నెలలు పట్టుద్ది. ఒకరు డిగ్రీ అందుకోవడానికి మూడేళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమేపట్టుద్ది’ అని విజయ్ చెప్తున్నా డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం తమిళంలో ‘మెర్సల్’ పేరు మీదుగా విడుదలయ్యి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఈ నెల 27 న విడుదల కానుంది.