ఇండోనేషియాలో భారీ పేలుడు..

SMTV Desk 2017-10-26 18:00:40  Massive explosion in Indonesia, 47 people died,

ఇండోనేషియా, అక్టోబర్ 26 : బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది మృతి చెందిన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ ఘటన సుమారు ఉదయం 9 గంటలకు చోటు చేసుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వివరాలలోకి వెళ్తే... ఇండోనేషియాలోని జకార్తా తంగెరాంగ్ ప్రాంతంలో ఉన్నట్టుండి ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఆ భవనమంతా మంటలు వ్యాపించగా 47 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 47 మ౦ది చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.