జనసేన కార్యాలయం ప్రారంభం...

SMTV Desk 2017-10-25 18:37:43  PAVAN KALYAN, JANASENA PARTY OFFICE, HYDERABAD, JANASENA MEMBER NIMMALA VERANNA

హైదరాబాద్, అక్టోబర్ 25: జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో జన సేన పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మొదటగా భరత మాత చిత్ర పటానికి పూల మాల వేసి, పూజలు చేశారు. ఆ తర్వాత సర్వ మత ప్రార్ధనల నడుమ కార్యాలయాన్ని అధికారికంగా శ్రీకారం చుట్టారు. జన సేన ముఖ్య ప్రతినిధులు, పలువురు సన్నిహితులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నటుడు అలీ తెలుగులో ఉన్న ఖురాన్ ను పవన్ కు బహుకరించారు. ఈ వేడుకలో రాష్ట్రానికి చెందిన జన సేన కార్యకర్త నిమ్మల వీరన్న ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘పార్టీ పరిపాలన సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పనిచేస్తుంది. విశాలమైన స్థలంలో అమరావతి లోను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంటే చాలు. అది మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని అనడానికి నిమ్మల వీరన్న నిదర్శనమని’ ఆయన పేర్కొన్నారు.