గ్రామాల్లో డంపింగ్ యార్డులు :నారా లోకేష్

SMTV Desk 2017-10-24 18:51:38  Dumping yards, Minister Nara Lokesh

న్యూఢిల్లీ, అక్టోబర్ 24 : 2019 నాటికి ప్రతి గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా పర్చూరులో పర్యటిస్తున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మార్టూరు బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కువగా ఉన్న తాగు నీటి సమస్యకు పరిష్కారం చూపుతమన్నారు. ఇంటింటికీ నల్ల ద్వారా మంచి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి పక్షం మాత్రం ప్రభుత్వంపై బురద చెల్లె కుట్ర పడుతుందని విమర్శించారు.