ముంబై, అక్టోబర్ 23 : కివీస్ తో జరిగే మూడు T-20 మ్యాచ్ ల కోసం బీసీసీఐ భారత్ జట్టుని ప్రకటించింది. ఈ జాబితాలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన యువ కిరణం మహమ్మద్ సిరాజ్, ముంబయి ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తొలిసారి భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఆసీస్ తో T-20 సిరీస్ ఎంపికై కూడా ఒక్క మ్యాచ్ ఆడని నెహ్రా ఈ సిరీస్ కు ఎంపికయ్యాడు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే T-20 మ్యాచ్ అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, ఆశిష్ నెహ్రా, మహమ్మద్ సిరాజ్.