ఎన్టీఆర్ సినిమాకు.. పవన్ హైలెట్..

SMTV Desk 2017-10-23 18:56:54  ntr, pavankalyan, trivikram,

హైదరాబాద్, అక్టోబర్ 23: ‘జైలవకుశ’ సినిమాలో త్రిపాత్రాభినయం చేసి మరోసారి తన సత్తాను చాటుకున్న య౦గ్ టైగర్ ఎన్టీఆర్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన 28 చిత్రాన్ని ప్రారంభించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పూజ కార్యక్రమం అనంతరం.. పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అక్కడ కాసేపు వీరి ఇరువురు వేసుకున్న కుశల ప్రశ్నలు అందరికీ నవ్వులు తెప్పించాయి. ఆ తరువాత దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఇంకా ఈ కార్యక్రమంలో తారక్ తో పాటు సతీమణి లక్ష్మి ప్రణతి, తనయుడు అభయ్ రామ్ కూడా పాల్గొని సందడి చేశారు.