కోహ్లి వీర విహారం.. కివీస్ లక్ష్యం 281..

SMTV Desk 2017-10-22 18:40:07  BHARATH, NEW ZEALAND, ONE DAY MATCH UPDATES.

ముంబై,అక్టోబర్ 22 : భారత్ సారధి విరాట్ కోహ్లి మరోసారి జూలు విదిల్చాడు.. కివీస్ తో ముంబైలో జరుగుతున్న మొదటి వన్డేలో ఈ పరుగుల వీరుడు (121;125 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం సాధించడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(9), శిఖర్ ధావన్(20) వికెట్లను కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన జాదవ్(12) దినేష్ కార్తీక్(37), ధోని(25), పాండ్య(16), భువనేశ్వర్(26) భాగస్వామ్యంతో కోహ్లి జట్టుని ఆదుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లి వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు సాధించగా, టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు. సాంత్నార్ కు ఒక వికెట్ లభించింది.