దేవుణ్ణి దర్శించుకొని వస్తుండగా.. ఘోర ప్రమాదం..

SMTV Desk 2017-10-21 14:35:52  THAMIL NADU, THIRUTTANI, CHENNAI, ACCIDENT

తమిళనాడు, అక్టోబర్ 21: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నైలోని 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న తిరుత్తణిలో ప్రముఖ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించేందుకు మధురై జిల్లాకు చెందిన 40 మంది భక్తులు వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం తిరుగు ప్రయాణం చేపట్టారు. అయితే ఒక్కసారిగా కొండపై నుండి బస్సు అదుపు తప్పి కిందపడింది. 30 అడుగుల ఎత్తు నుండి కిందకుపడిన బస్సు నేరుగా వేప చెట్టు మీద పడి, ఆ తర్వాత కింద రోడ్డుపై వెళ్తున్న ఆటో పై పడి నేలను తాకింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. బస్సులోని భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.