ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో టాప్ దక్షిణాఫ్రికా ..

SMTV Desk 2017-10-20 20:06:44  india, cricket ODI rankings, kohli

దుబాయ్ , అక్టోబర్ 20 : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ రెండో ర్యాంక్ కి పరితమైంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సఫారీలు ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను 4-1 తో కైవసం చేసుకొని భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్నా సిరీస్ లో సఫారీ జట్టు వరుస విజయాలతో తిరిగి తొలి స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వచ్చి రాగానే అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సఫారీ ఆటగాడు ఏబీ డెవిలియర్స్‌ మొదటి స్థానాన్ని దక్కించుకోగా. టీం ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక బౌలింగ్ విభాగం లో.. పాక్ బౌలర్ హసన్ అలీ ప్రధమ స్థానంలో ఉండగా.. టీం ఇండియా జట్టులో డెత్ ఓవర్స్ స్పెషలీస్ట్‌ బుమ్రాకు ఆరో స్థానం దక్కగా.. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.