తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తల్లి కన్నుమూత..

SMTV Desk 2017-10-20 17:02:06  governer narasimhanmotherPasses away

హైదరాబాద్, అక్టోబర్ 20 : తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మాతృ మూర్తి విజయలక్ష్మి శ్రీనివాసన్‌(94) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజయలక్ష్మి మృతికి సంతాపం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో పలువురు నేతలు, అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు సానుభూతి తెలిపారు.