ఎనిమిది పదుల వయస్సులోనూ సాహసం..

SMTV Desk 2017-10-20 16:15:24  ingland, A grandmother called Trish Wagh Staff, Getting ready to make adventures

ఇంగ్లాండ్, అక్టోబర్ 20 : ఇంగ్లాండ్ కు చెందిన త్రిష్ వాగ్ స్టాఫ్ అనే బామ్మ ఎనిమిది పదుల వయస్సులోనూ సాహసాలు చేయడానికి సిద్దమంటున్నారు. అంత వయస్సులోనూ చలాకీగా ఉన్న బామ్మను చూస్తుంటే ముచ్చటేస్తుంది. 2002లో ఆమె భర్త చనిపోయిన తరువాత తను సాహస యాత్రను ప్రారంభించింది. చాలా మంది భయపడే స్కై డైవింగ్, పారా గ్లైడింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఈ సాహసాల ద్వారా వచ్చిన 1.50 లక్షల యూరోపియన్ డాలర్‌లను చారిటీలకు ఇస్తుంది. ఈ సందర్భంగా.. తన భర్త ఆర్మీలో పనిచేసేటప్పుడు ఇంతకన్నా భయంకరమైన ప్రమాదాలు దగ్గర నుంచి చూశానని, వాటికన్నా ఇవి భయంకరమైనవి కాదంటోంది. అంతేకాకుండా వయసు పైబడిన వారందరూ ఏదో ఒకటి సాధించాలని పిలుపునిస్తుంది.