న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్వో దీపావళి సందర్భంగా తమ ఖాతాదారులకు కొత్త సదుపాయం అందుబాటులో తీసుకొచ్చింది. ఈపీఎఫ్వో ఖాతా దార్లు తమ పీఎఫ్ ఖాతా సంఖ్యను ఆన్ లైన్లో ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఖాతాదారులకు ఉత్తమమైన, వేగవంతమైన సేవలు అందించడానికి ఆధార్ అనుసంధానం మేలు చేస్తుందని ఈపీఎఫ్వో అధికారులు పేర్కొన్నారు. కాగా ఈపీఎఫ్వో వెబ్ సైట్ లోకి వెళ్లి అనుసంధాన సేవలు పొందవచ్చని సంస్థ వెల్లడించింది.