న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : భారత టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి పండగ సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. కేవలం ఒక రూపాయికే సేవలను అందిస్తోంది. కంప్యూటర్లు వైరస్ ల బారిన పడకుండా "ఎక్స్జెన్ ప్లస్ సెక్యూరిటీ ఫీచర్స్" పేరిట ఒక రూపాయికే సేవలను అందించడానికి జైపూర్ కు చెందిన డేటా ఇన్ఫోసిస్ అనే కార్పోరేట్ ఈ-మెయిల్ సర్వీస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సేవలు ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు ఏడాదికి రూ.365 చెల్లిస్తే ఈ ఎక్స్జెన్ సేవలను ఈ-మెయిల్స్తో లింక్ చేస్తారు. రూ.365కి 1 జీబీ స్టోరేజి, రూ.999కి 10 గీగా బైట్ల స్టోరేజీ ఉంటుంది. ఏడాది ఒకసారి మాత్రమే చెల్లింపులు ఉంటాయని డేటా ఇన్ఫోసిస్ సీఈవో అజయ్ తెలిపారు.