పార్టీనేతలంతా ఐక్యంగా పని చేయాలి: ఆర్సీ కుంతియా

SMTV Desk 2017-10-20 12:27:18  Rajiv Sadbhavna Yatra, PCC president Uttam Kumar, Reddy, Janarreddi, Shabbir Ali, former cricketer Azharuddin

హైదరాబాద్, అక్టోబర్ 20 : వచ్చే ఎన్నికల్లో పార్టీనేతలంతా ఐక్యంగా పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా పిలుపును ఇచ్చారు. నేడు చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావనా యాత్ర సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌, రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ తదితరులు హాజరయ్యారు. విశ్రాంత ఐఏఎస్‌ గోపాలకృష్ణకు రాజీవ్‌ సద్భావన అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రం నుంచి అజారుద్దీన్‌ ఎంపీగా లేదా ఎమ్మెల్యే గా పోటీ చేస్తే సహకరిస్తా మన్న ఉత్తమ్, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.