దీపావళి వేడుకల్లో విషాదాలు

SMTV Desk 2017-10-20 12:19:51  hyderabad, diwali celebrations, The fireworks were 27 injured.

హైదరాబాద్, అక్టోబర్ 20 : రంగు రంగుల విద్యుత్ దీపాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండగ వేడుకల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బాణాసంచా కాలుస్తూ 27 మంది గాయపడ్డారు. ఈ గాయపడిన వారందరినీ సరోజిని దేవి ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. వీరిలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఓ బీటెక్ విద్యార్థిని కంట్లోకి రాకెట్ దూసుకెళ్ళడంతో తీవ్ర గాయం కాగా ఆసుపత్రిలో చేర్పించిన ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు వెల్లడించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని ఆసుపత్రి వర్గాలు అంచనా వేస్తున్నాయి.