న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : భారత్-పాక్ లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని అటారీ-వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్లకు బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు అందజేసింది. భారత్ పాక్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల కొన్ని పర్వదినాల సందర్భంగా ఈ సంప్రదాయాన్ని పాటించకపోయినా మళ్లీ దీపావళి నాడు పాక్ దళాలకు మిఠాయిలు అందించాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.