జమ్మూ కశ్మీర్, అక్టోబర్ 18 : కాల్పుల విరమణ ఒప్పందానికి యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ తాజాగా మరోమారు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్ లోని వివిధ సెక్టర్లలో సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా పాక్ బలగాలు దాడులు జరుపుతున్నాయి. ఈ దాడిలో నలుగురు భారతీయ పౌరులు గాయపడ్డారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నారు.