రూ. 100 కోట్లతో అమ్మవారి దర్శనం...

SMTV Desk 2017-10-18 13:17:38  RATLAM, Diwali, mahalakshmi temple

రత్లాం, అక్టోబర్ 18: అక్కడ అమ్మవారికి దీపావళి సందర్బంగా 100 కోట్ల కరెన్సీ తో అలంకరిస్తారట. అవాకయ్యరా..! విషయం ఏటంటే... రత్లాం లో మహాలక్ష్మి అలయంలోని అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకొని భక్తులు తమ నగదు, విలువైన ఆభరణాలు అక్కడి పూజారికి ఇస్తుంటారు. ఇలా చేస్తే వారీ కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ఆ పూజారి ఈ నగదు, వెండి బంగారు ఆభరణాలను, గర్భగుడిలోని అమ్మవారికి అలంకరిస్తారు. అలా ఇప్పటివరకు 100 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు రాగ, వాటితో మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించారు. ఇందులో అసలు కిటుక్కు ఏ౦టంటే... ఈ వేడుక పూర్తయిన తర్వాత అక్కడి అర్చకులు, భక్తులకు తమ వస్తువులను తిరిగి ఇచ్చేస్తారు. దీనికోసం వారు ప్రత్యేకంగా రికార్డు పుస్తకం నిర్వహిస్తారట. ఇంతవరకు అక్కడికి వచ్చిన భక్తులు ఏ ఒక్కరు కూడా తమ వస్తువులను పోగొట్టుకోక పోవడం విశేషంగా నిలిచింది.