పరీక్ష కేంద్రానికి చరవాణి.....

SMTV Desk 2017-10-17 17:32:01  Student, Nursing first year, kakinada new updates

కాకినాడ, అక్టోబర్ 17 : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో సోమవారం ఓ విద్యార్ధి పరీక్ష కేంద్రానికి స్లిపులతో పాటు చరవాణిని కూడా తీసుకువచ్చింది. లోపలికి వెళ్ళే ముందు తనిఖీ బృందం ఆమె చేతిలో ఉన్న స్లిప్పులను చూసి లోపలికి అనుమతించేది లేదని గట్టిగా చెప్పారు. మీరు ఎవరు నన్ను అడ్డగించడానికి ఇది నా సొంత విషయం అని వాదులాటకు దిగింది. విద్యార్ధి వినకపోవడంతో విషయాన్ని పరీక్ష పర్యవేక్షకురాలికి తెలియజేశారు. ఆమె కూడా స్లిపులు తీసుకు వస్తే పరీక్ష వ్రాసేది లేదని హెచ్చరించారు. దాంతో ఆ విద్యార్ధి మీరు అనుమతించేదేంటి నేనే వెళ్ళిపోతున్న అని అక్కడి నుండి వెళ్లిపోయింది.