వాషింగ్టన్, అక్టోబర్ 17 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విధులు నిర్వర్తిస్తూ అమరులైన ఆర్మీ అధికారుల కుటుంబాలను ఒబామా పలకరించేవారు కాదని ఆరోపించారు. తాజాగా ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఆర్మీ అధికారులపై జరిగిన కాల్పుల్లో అమెరికా సైన్యానికి చెందిన నలుగురు అధికారులు మృతిచెందారు. ఈ క్రమంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ను మీడియా పలు ప్రశ్నలు సంధించింది. ఆ ప్రశ్నలకు స్పందించిన ట్రంప్.. "మరణించిన అధికారులకు ఒబామా కేవలం లేఖలు మాత్రమే రాసేవారు.. నేను మాత్రం త్వరలో వారి కుటుంబాలతో ఫోనులో మాట్లాడతానని తెలిపారు. కేవలం ఒబామానే కాకుండా మాజీ అధ్యక్షులు కూడా పట్టించుకునేవారు కాదు. వారందరూ లేఖలు మాత్రమే రాసేవారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ అమరుల కుటుంబాలతో ఫోనులో ఆరాటపడుతున్నా" అని వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఒబామా అనుచరులు ట్రంప్ చెప్పేవన్ని అబద్దాలేనని ఆ వ్యాఖ్యలను ఖండించారు.