హైదరాబాద్, అక్టోబర్ 17 : ఈ నెల 13 న భారత్-ఆసీస్ ల మధ్య టి20 మ్యాచ్ రద్దు కావడంతో టికెట్లు కొన్నవారికి ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సిద్ధమైంది. దీనికి సంబంధించి తేదీలను సోమవారం ప్రకటించింది. ఆయా తేదిలలో ప్రేక్షకులు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు తమ టికెట్ తో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకువస్తే అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేస్తామని హెచ్సీఏ వివరించింది. తేది వివరాలు : అక్టోబర్ 23, 24: రూ. 800; అక్టోబర్ 25, 26: రూ. 1,000; అక్టోబర్ 27, 28: రూ. 1,500; అక్టోబర్ 30, 31: రూ. 5,000