సిడ్నీ,అక్టోబర్ 16 : ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియా వెళ్తున్న ఓ ఎయిర్ఏషియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. దాదాపు 32 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్కసారి గా 10 వేల అడుగులకి చేరింది. వెంటనే విమానంలోని అలారం మోగి కేబిన్ పీడనం తగ్గి సీలింగ్ నుంచి ఆక్సిజన్ మాస్కులు పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటన నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని ఎయిర్ఏషియా సంస్థ వెల్లడించింది.