బెంగుళూర్, అక్టోబర్ 16: బెంగుళూర్ లోని ఎజిపురా ప్రాంతంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ భవనంలో సిలిండర్ పేలి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో నాలుగు భవనాలు కుప్పకూలగా మరో మూడు బిల్డింగ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. జేసీబీల సహాయంతో సహాయ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన ఘటనలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది. అయితే ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులు మృతి చెందడంతో, బాలికను దత్తత తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ జార్జ్ ఘటన స్థలాన్ని చేరుకున్నారు. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడ్డ ముగ్గురికి ఘటనా స్థలంలోనే రూ.50వేల నగదును అందజేశారు.