ముఖ్యమంత్రితో భేటికానున్న బుట్టా రేణుక...

SMTV Desk 2017-10-15 22:51:37  tdp,ysrcp,chiefminister,karnoool

కర్నూలు : వైసిపీ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపి పార్టీలో చేరే అంశంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు అవే వార్తలను ఆమె నిజం చేయనున్నారు. కాగా, శుక్రవారం బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మారే అంశంపై చర్చించారు. మరో రెండురోజుల్లో ఆమె పార్టీ మారే విషయంపై అధికారంగా ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రికి తెలియజేసారు. దీనిపై పార్టీ కార్యకర్తలతో, అనుచరులతో చర్చించనున్నట్లు ఆమె చంద్రబాబుకు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో ఏదైనా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. ఈ విషయం పై మరోసారి నేడు ఆమె భర్తతో కలిసి చంద్రబాబును కలవనున్నారు. అయితే వైసిపీపార్టీ నుండి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తుంది .