న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : ఇప్పటి వరకు మనకు సెల్ఫీ తెలుసు.. మరి బోథీ ఏంటి అనుకుంటున్నారా..? సెల్ఫీ కావాలంటే మనం ముందు కెమెరా వాడతాం. మామూలుగా ఫొటోల కోసమైతే వెనుక కెమెరా వాడతాం. కానీ ఒకేసారి ముందు, వెనుక కెమెరాల ద్వారా ఫోటో తీసుకోవచ్చు.. అదే బోథీ. స్మార్ట్ఫోన్లలో ఈ తరహా టెక్నాలజీతో ‘నోకియా 8’ స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ఇది శనివారమే భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 7.1.1 ఓఎస్తో పనిచేసే ఈ ఫోన్ పాలిష్డ్ బ్లూ, టెంపెర్డ్ బ్లూ, స్టీల్ అండ్ పాలిష్డ్ బ్లూ వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర రూ.36,999.