బెంగళూరు,అక్టోబర్ 15 :దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను పోలీసు అధికారులు విడుదల చేశారు. ఆమె నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాలో నమోదైన చిత్రాల బట్టి ముగ్గురు నిందితుల రేఖా చిత్రాలను నిపుణుల సాయంతో రూపొందించారు. వాటిని మీడియా ముందు విడుదల చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారి బి.కె.సింగ్ మాట్లాడుతూ.. హంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చారని వారు వచ్చిన మోడల్ బైకు ఏ౦టన్నది.. దాని రిజిస్ట్రేషన్ నంబరు ఏ౦టన్నది గుర్తించామన్నారు. ఊహా చిత్రాల ద్వారా ప్రజల నుంచి మరింత సమాచారం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరీ లంకేశ్ హత్యకు 7.65 కంట్రీమేడ్ తుపాకీని దుండగులు ఉపయోగించారని ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైందని తెలిపారు. నిందితుల వివరాలుంటే బెంగళూరులోని కంట్రోల్రూంకు (104, 100 నంబర్లు) లేదా సీఐడీ కార్యాలయానికి (9480800202) వాట్సాప్ నంబర్లు (9480800304, 9480801701)కు సమాచారం పంపాలని కోరారు.