న్యూఢిల్లీ, అక్టోబర్ 11 : భారత ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అనుబంధ బ్యాంకుల పాత చెక్బుక్లు చెల్లబోవంటూ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఈ అనుబంధ బ్యాంకుల్లోని ఖాతాదారుల వద్ద ఉన్న పాత చెక్బుక్లు సెప్టెంబర్ 30 నుంచి పనిచేయబోవని ఎస్బీఐ వెల్లడించింది. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాత చెక్బుక్ల చెల్లుబాటు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ఎస్బీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ లోగా కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.