విమానాశ్రయంలో కలకలం..

SMTV Desk 2017-10-11 18:31:51  Airport in Renigunta, found bullets, 9 mm gun

రేణిగుంట,అక్టోబర్ 11 : తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఓ సంఘటన కలకలం రేపింది. తిరుపతికి చెందిన మోహన్ రెడ్డి అనే ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్ళడానికి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేస్తుండగా అతని బ్యాగ్ లో తూటాలు ఉన్నట్లు గమనించారు. 9ఎంఎం తుపాకీలో వాడే 17 మాగ్జిన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆయుధం లేకుండా తూటాలు తీసుకెళ్ళడంపై అనుమానం వ్యక్తం చేస్తూ, కేసును ఎయిర్‌ పెయిడ్‌ పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.