టీఆర్ఎస్వీ నేతలతో కేసీఆర్

SMTV Desk 2017-10-11 15:38:14  Telangana bhavan, KCR Meeting, TRSV

హైదరాబాద్, అక్టోబర్ 11 : తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లా సమన్వయ కర్తలతో భేటీ అయ్యారు. విద్యార్ధి విభాగం పటిష్టత భవిష్యత్ కార్య చరణ పై దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్తు అంతా యువతదే అన్న సీఎం కేసీఆర్, ఈ దిశగా సానుకూల దృక్పథం తో పని చేయాలని సూచించారు. “తెలంగాణ విద్యార్థులంటే దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర మరవ లేనిది. విద్యార్థి నేతలు కేవలం ఆందోళనలకే పరిమితం కాలేదు. అందరి మనస్సులకు హత్తుకునేలా తెలంగాణ ఆవశ్యకతను చెప్పారు. విద్యార్థులు ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలి” అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు టీఆర్ఎస్వీ విభాగం అంతా నేతలతో తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ సందడి నెలకొంది.