బెదిరింపులకు బయపడకుండా "లక్ష్మిస్ ఎన్టీఆర్" చిత్రాన్ని నిర్మిస్తామంటున్న నిర్మాత

SMTV Desk 2017-10-11 07:34:03  ram gopal varma, ycp rajesh reddy, laxmis ntr, roja

హైదరాబాద్ అక్టోబర్ 10: సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే ఏకైక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సినిమా ఎప్పుడు మొదలవుతుందో తనకే తెలీదని చాలా సార్లు పబ్లిక్ గానే చెప్పాడు. ఈ సారి మాత్రం ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ చిత్రం తప్పక ప్రారంభం కానుందని అంటున్నారు. ఈ చిత్ర నిర్మాతగా వైసీపీ నేత రాకేశ్ రెడ్డి ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే రామ్ గోపాల్ వర్మ రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, చిత్రం లోని పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని చెప్పారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇందులో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా నిర్మాత రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరి బెదిరింపులకు బయపడకుండా సినిమాను నిర్మిస్తామని, అలాగే చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైన వెనుకాడబోమని అన్నారు.