పశ్చిమ గోదావరి, అక్టోబర్ 10 : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతంలో దీపావళి పండగను పురస్కరించుకొని టపాసులు, బాణాసంచాలను తరలిస్తున్న ఆటోలో దురదృష్టవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహన౦ కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై డీఐజీ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా ఆటోలో అధిక లోడుతో వెళ్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశించారు. పండగ సందర్భంగా పిల్లలు కాల్చే టపాసుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.