లారీలను నిలిపివేయాలంటూ ధర్నా..

SMTV Desk 2017-10-10 14:02:25   Dharna to stop lorries, East Godavari, TDP MLA Ramanjaneyulu Pulaparathi.

తూర్పుగోదావరి, అక్టోబర్ 10 : అనుమతి లేని లారీల వలన గ్రామంలోని రోడ్లన్నీ పాడవుతున్నాయంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా, గన్నవరం మండలం లంకల గన్నవరం శివారు నడిగాడిలో చోటు చేసుకుంది. ఇసుక లారీల వలన గ్రామంలోని రోడ్లన్ని గుంతలు పడి అధ్వానంగా తయారవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన గ్రామస్థులు ఇసుక లారీలను నిలిపివేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు పులపర్తి రూ.10 లక్షలతో రహదారులు నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ధర్నాను విరమించుకున్నారు.