తాడిపత్రి, అక్టోబర్ 09 : అనంతపురం జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.... తాడిపత్రి పట్టణంలోని గన్నేవారిపల్లె కాలనీకి చెందిన రమేశ్(13), పాత కోటకు చెందిన గణేష్(13) గత శనివారం పెన్నా నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఆదివారం ఈ సంఘటన ప్రాంతాన్ని చూడటానికి వెళ్లిన భగత్ సింగ్ నగర్ కు చెందిన మరో వ్యక్తి కూడా కనపడక పోవడంతో, ఈ ఘటనపై స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ....మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి మృతదేహాలను వెలికి తీసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం కూడా తాడిపత్రి లో భారీ వర్షం వల్ల పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుందని, ప్రజలను నది దగ్గరకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు గల్లంతైన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఆర్థికసాయం అందించారు.