హైదరాబాద్, అక్టోబర్ 9 : ప్రతిష్ఠాత్మక ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్) వేలం మూడో సీజన్ లో టాప్ బాడ్మింటన్ ప్లేయర్ కరోలినా మారిన్ హైదరాబాద్ తరుపున మరోసారి ఆడనుంది. 50 లక్షలతో హైదరాబాద్ హంటర్స్ ఆమెను దక్కించుకొంది. గత స౦వత్సరం తమ టీంలో ఉన్న క్రీడాకారుల్లో ఒకరిని తిరిగి ఎంచుకోవాల్సిందిగా సూచించగా.. పి.వి. సింధును చెన్నై స్మాషర్స్ తమ వద్దే పెట్టుకున్నారు. 52 లక్షలతో మహిళా నెంబర్ వన్ క్రీడాకారిణి తైజుయింగ్ను అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ దక్కించుకొంది.